Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పతనం

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పతనం
, బుధవారం, 8 జనవరి 2020 (07:22 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి మళ్లీ విజృంభిస్తోంది. చలితోపాటు రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో చలి మళ్లీ విజృంభిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి క్రమంగా పెరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున ఆదిలాబాద్​ జిల్లా భోరజ్​లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​లో 10.7, హన్మకొండలో 14.5, హైదరాబాద్​లో 17.7, నిజామాబాద్​, రామగుండంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈశాన్య భారతం నుంచి తెలంగాణవైపు తేమగాలులు వీస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ తేలికపాలిట వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం 6 ప్రాంతాల్లో స్వల్పంగా జల్లులు పడ్డాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో షెడ్యూలు ప్రకారమే పురపాలక ఎన్నికలు