Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెలిచాక పార్టీ మారనంటూ బాండ్ రాసిస్తేనే బీఫామ్!

గెలిచాక పార్టీ మారనంటూ బాండ్ రాసిస్తేనే బీఫామ్!
, ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (12:20 IST)
ఇటీవలికాలంలో ఒక పార్టీ టిక్కెట్‌పై గెలిచిన తర్వాత విజయం సాధించాక మరోపార్టీలోకి జంప్ కావడం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చే తాయిలాలకు విపక్ష పార్టీలకు చెందిన విజేతలు పార్టీ మారిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించిన తర్వాత పార్టీ మారబోనంటూ బాండ్ పత్రం రాసిస్తేనే బిఫామ్ ఇస్తామనే షరతను విధిస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పలువు కాంగ్రెస్ పార్టీ విజేతలు అధికార తెరాసలో చేరారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గెలిచిన తర్వాత తాము పార్టీ వీడబోమంటూ బాంబ్ పేపర్ రాసిచ్చినవారికే బీఫామ్‌ ఇస్తోంది. 
 
ఈ వివరాల్లోకి వెళ్తే కామారెడ్డిలో గెలిచిన తర్వాత పార్టీ మారబోమంటూ బాండ్ పేపర్ రాసిచ్చే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీని కోరారు స్థానిక కార్యకర్తలు. మన పార్టీ బిఫామ్ మీద పోటీ చేసి గెలవగానే తెరాస పార్టీలో చేరుతున్నారంటూ షబ్బీర్ అలీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అయితే, కామారెడ్డి జిల్లాలో జరుగుతోన్న తొలి విడత ఎన్నికల కోసం అభ్యర్థులకు బీఫారమ్‌లు ఇచ్చే సమయంలో ఇది చర్చగా మారింది. దీంతో పార్టీ మారబోమని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 9 మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు షబ్బీర్ అలీ సమక్షంలో బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి బీఫామ్‌లు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్ర సృష్టించిన 'ఖడ్గమృగం'