తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా అనంతపురం గ్రామంలో పరశురాముడు అనే యువకుడు సూదిని మింగాడు. పశువులకు ఇంజెక్షన్లు వేసేందుకు వినియోగించే సూదిని నోట్లో పెట్టుకునివుండగా, అది కాస్త పొరపాటున ఒక్కసారిగా గొంతులోకి చేరి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	దీంతో ఆ యువకుడు గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, విపరీతమైన దగ్గుతో బాధపడ్డాడు. అయితే అతడి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని కర్నూలులోని సత్యసాయి ఈఎన్టీ ఆసుపత్రికి తరలించారు. 
 
									
										
								
																	
	 
	వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అత్యాధునిక టెలిస్కోపిక్ బ్రాంకోస్కోప్ ద్వారా ఆ సూదిని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన పద్ధతి ద్వారా ఆ సూదిని తొలగించామని వైద్యులు చెప్పడంతో పరశురాముడు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.