Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కారణంగా అనాథలైన చిన్నారులు.. ఎమెర్జెన్సీ నెంబర్లతో సెల్ ఫోన్లు

కరోనా కారణంగా అనాథలైన చిన్నారులు.. ఎమెర్జెన్సీ నెంబర్లతో సెల్ ఫోన్లు
, శనివారం, 12 జూన్ 2021 (13:19 IST)
Orphans
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ముందుకు వచ్చింది. వారిని తమ ఆశ్రమాల్లోకి తీసుకుని సంరక్షిస్తోంది. ఇలా కేవలం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన వారు కొంతమంది రాష్ట్ర శిశు సంక్షేమశాఖ ఆశ్రమంలో ఉంటున్నారు. కాగా మరికొంతమంది తమ బంధువుల వద్ద సంరక్షింపబడుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 138 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. 
 
అయితే వీరందరికి ఎలాంటీ లోటు రాకుండా ఉండడడంతో పాటు వారికి ఎలాంటీ ఇబ్బంది వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేందుకు వారందరికి సెల్ ఫోన్‌లు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ సెల్‌ఫోన్‌లలో జిల్లాస్థాయి అధికారులతో పాటు, హెల్ప్‌లైన్, ఎమర్జెన్సీ నెంబర్లను ఫీడ్ చేసి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 
 
దీని ద్వారా వారు ఎప్పుడైనా.. అధికారులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వీరికి నెలవారి రేషన్, సరుకులు, సెల్ ఫోన్లు అందించేందుకు స్వచ్ఛంధ సేవ సంస్థల సహాకారం తీసుకోనున్నారు. స్కూళ్లు ప్రారంభం అయిన తర్వాత అందరని రెసిడేన్సియల్ స్కూళ్లలో చేర్పించేందుకు కరోనా మహమ్మారిన పడి తల్లితండ్రులను కోల్పోయిన చాలా మంది పిల్లలు అనాథలయ్యారు.
 
దీంతో వారి భాద్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.. ఇలా కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వారికి మరింత చేయూత నివ్వడం ద్వార వాళ్లు నిర్భయంగా బ్రతకగలరనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 1 నుండి రైల్వే యొక్క ఈ 10 నియమాలు