Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో కోవిడ్ 19 సెకండ్ డోస్ టీకా ప్రారంభం

తెలంగాణలో కోవిడ్ 19 సెకండ్ డోస్ టీకా ప్రారంభం
, మంగళవారం, 25 మే 2021 (12:28 IST)
45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్- 19 టీకాల రెండవ మోతాదు మంగళవారం నుంచి తెలంగాణ అంతటా ప్రారంభమయ్యింది. రెండవ టీకా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు.
 
కోవిడ్ వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్నవారు, రెండవ మోతాదుకి అర్హత ఉన్న వ్యక్తులు సమీపంలోని ప్రభుత్వ టీకా కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోవాలని సోమవారం తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. మే 16న, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రెండవ మోతాదు ఇనాక్యులేషన్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 
కోవాక్సిన్ వ్యాక్సిన్ తగినంతగా లేకపోవడం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి తాజా స్టాక్‌లను స్వీకరించకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తక్కువ స్టాక్స్ కారణంగా 18 మరియు 44 మధ్య వ్యక్తుల నిర్వహణను కూడా ప్రారంభించలేదు.
 
ఇంకోవైపు COVID-19 సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించడానికి, వాటి కోసం ప్రత్యేక టీకా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌కూ రంగేశారు... అద్దె వాహనాలకూ వైకాపా రంగులు