Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ వరి దీక్ష : ఒకే వేదికపై రేవంత్ - కోమటిరెడ్డి

కాంగ్రెస్ వరి దీక్ష : ఒకే వేదికపై రేవంత్ - కోమటిరెడ్డి
, శనివారం, 27 నవంబరు 2021 (14:44 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకుంది. ఇందులోభాగంగా, శనివారం నుంచి వరి దీక్షను చేపట్టింది. ఈ దీక్షను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టారు. ఇక్కడ విశేషమేమిటంటే.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరిదీక్షకు ఆ పార్టీ నేతలంతా సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరూ హాజరయ్యారు. ఆ ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొన్నారు. 
 
కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమిటిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబు అంత సీరియ‌స్ ఎందుక‌య్యాడు... ఉండవల్లి కామెంట్స్