Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో పాముల కోసం రెస్క్యూ సెంటర్‌

Advertiesment
Rescue center
మేడ్చల్‌ జిల్లా భౌరంపేట్‌లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రూ.1.40 కోట్లతో స్నేక్‌ రెస్క్యూ సెంటర్‌ ఏర్పాటైంది. రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దీనిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా 35 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మరో నెల రోజుల్లో నిర్మల్‌లో కోతుల సంరక్షణ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు.

పాములను చూసి భయపడొద్దని, స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారమిస్తే వాటిని సురక్షితంగా ఈ కేంద్రానికి తరలిస్తారన్నారు.

చెన్నైలోని గిండి స్నేక్‌ పార్క్‌కు దీటుగా భౌరంపేట్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 180 మంది స్నేక్‌ సొసైటీ సభ్యులు సహకారం అందిస్తున్నారని మంత్రి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వరూపానందస్వామికి బ్లాక్‌మెయిల్‌ చేయడం అలవాటే: శ్రీనివాసానంద సంచలన ఆరోపణలు