Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిషన్ రెడ్డి , రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు.. ఏం తెలుసురా బిడ్డ నీకు..?

Advertiesment
Palla rajeshwar reddy
, శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (18:51 IST)
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెరాసా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి , రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు అని మండిపడ్డారు.
 
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బ్లాక్ మెయిలర్ రేవంత్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ ఏం తెలుసురా బిడ్డ నీకు.. తెలంగాణ సాయుధ పోరాటం గురించి అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నోటి తిట ఎక్కువ అయ్యింది.. తిట తీరుస్తామని హెచ్చరించారు . 
 
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ ఘర్షణ సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి చురకలంటించారు. 
 
రేవంత్ రెడ్డే పెద్ద డ్రగ్ అడిక్ట్ అని అలాంటి వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఇక మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనకుండా బీజేపీనేత కిషన్ రెడ్డి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్నారు. రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. భాష మార్చుకోకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఆగిపోయింది