Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన.. రోగిని వీపుపై మోసుకెళ్లాడు..

Warrangal
, శనివారం, 13 మే 2023 (11:09 IST)
Warrangal
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైద్యం పొందే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఈ ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక వ్యక్తి తన భార్యను తన వీపుపై మోశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లక్ష్మి అనే మహిళకు నెల రోజుల కిందటే శస్త్ర చికిత్స జరగడంతోపాటు తదుపరి పరీక్షలు చేయాల్సి రావడంతో దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆసుపత్రికి చేరుకోగా, ఆ రోజు వైద్యులు అందుబాటులో లేరని, మరుసటి రోజు రావాలని కోరారు. 
 
నడవలేని స్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు భర్త స్ట్రెచర్‌ను కోరాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది దానిని అందించడానికి నిరాకరించారు. దీంతో భార్యను తన భుజాలపై మోసుకెళ్ళాడు ఆ వ్యక్తి. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దం పట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీకి శిక్ష జడ్జికి పదోన్నతి.. అడ్డుకున్న సుప్రీం కోర్టు