Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యతో పూరీ జగన్నాథ్ ఫోటో.. ఛార్మీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత..?

Puri Jagannath
, గురువారం, 11 మే 2023 (16:14 IST)
Puri Jagannath
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా ఆయన భార్యతో తీసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త తనని కౌగిలించుకుంటున్న ఫోటోని ఆమె ఆనందంగా "జగ్గూ" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 
 
పూరి జగన్నాధ్, ఆయన భార్య లావణ్య పేట్ల చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలో గొడవలు అయ్యాయి అని, అందుకే పూరి జగన్నాధ్ ముంబైకి మకాం మార్చాడని పుకార్లు వచ్చాయి. 
 
కానీ, ఈ జంట ఇంకా భార్యాభర్తలుగానే కలిసి ఉంటున్నారని ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది. కాగా.. పూరీ జగన్నాథ్ సినిమా జీవితంలో ఛార్మీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. 
 
ప్రస్తుతం పూరి జగన్నాధ్ కెరీర్ ప్లానింగ్ మొత్తం ఆమె చూసుకుంటోంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌లా రామ్ పోతినేనితోనే హీరోగా పూరి సినిమా తీస్తున్నారు. ఛార్మి ఆ పనిలోనే ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో అఖిల్ అక్కినేని సరసన జాన్వీ కపూర్!!