Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో మహిళా మంత్రికి కరోనా పాజిటివ్

Advertiesment
Minister Satyavathi Rathod
, సోమవారం, 8 మార్చి 2021 (13:49 IST)
తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 3 లక్షలను దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా సోకింది. 
 
ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె హోమ్ ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో ఆమె చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 27 కేసులను నిర్ధారించారు. గత 24 గంటల్లో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,642 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరిగా పేరు మార్చుతాం... ఎవరు అడ్డుకుంటారో చూస్తాం : మురళీధర్ రావు