Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహావిష్కరణ

కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహావిష్కరణ
, మంగళవారం, 15 జూన్ 2021 (12:28 IST)
భారత్ - చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈయనకు కోర్టు చౌరస్తాకు సంతోష్‌ బాబు పేరు పెడ్తామని కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. 
 
సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీర చక్ర, కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు విగ్రహాన్ని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కోర్టు చౌరస్తాకు కల్నల్‌ సంతోష్‌ బాబు పేరును నామకరణం చేస్తారని తెలిపారు. అలాగే, ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు పాత జాతీయ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లోని చేపలు, పండ్ల మార్కెట్‌ బ్లాక్‌లను కూడా ప్రారంభిస్తారని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ ప్రమాణాలతో అయోధ్యలో బస్టాండ్.. యూపీ సీఎం