Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయనకు హైదరాబాద్ బిర్యానీ నచ్చలేదట.. కేటీఆర్ ఏమన్నారంటే?

Advertiesment
KTR
, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:44 IST)
హైదరాబాద్ బిర్యానికి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఫిదా అవుతుంటారు. కానీ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌కు మాత్రం హైదరాబాద్ బిర్యానీ నచ్చలేదట. ఆయన పారీస్‌కు చెందిన తలసేరి ఫిష్ బిర్యానీ సూపర్ అంటూ ఓటేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీ హక్కులన్నీ హైదరాబాద్‌కు చెందినవేనంటూ అమితాబ్‌కు వెల్లడించారు. తాను ఖచ్చితంగా చెబుతున్నట్లు, హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే.. మిగిలివన్నీ.. అనుకరించినవేనని తెలిపారు. ఇటీవలే యునెస్కో కూడా తమ ఆహార సంస్కృతీని గుర్తించి ఓ బిరుదు కూడా ఇచ్చిందని నీతి ఆయోగ్ సీఈవోకు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. 2019 సంవత్సరానికి గాను ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్‌లో టాప్-10 ఐటమ్స్‌లో బిర్యానీకి అగ్రస్థానం లభించింది. సగటున నెలకు 4.56 లక్షల మంది బిర్యానీ కోసం సెర్చ్ చేసినట్లు ఇండియన్ ఫుడ్స్‌పై అమెరికాకు చెందిన సెమ్ రష్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంజీ మోటార్ ఇండియా నుంచి లగ్జరీ కార్లు: SUV Gloster, MPV G10