Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్ పిచాయ్‌తో కేటీఆర్ భేటీ...

గూగుల్ పిచాయ్‌తో కేటీఆర్ భేటీ...
, బుధవారం, 22 జనవరి 2020 (21:15 IST)
రెండవ రోజు దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి కే. తారకరామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సిఈవోలు, గ్రూప్ చైర్మన్లు పాల్గొన్నారు. దావోస్‌లో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్‌లో గూగుల్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు.
 
హైదరాబాద్ నగరంలో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని భవిష్యత్తు విస్తరణ పైన ఈ సందర్భంగా చర్చించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ ఆయిన బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ మంత్రి కేటీఆర్‌ని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని చైర్మన్‌కు కేటీఆర్ తెలియజేశారు.
 
ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. రాక్‌వెల్ అటోమేషన్ సిఈవో ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, కెటిఆర్‌ను కలిసారు. 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. 
 
హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. 
మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె గోయాంక, కెపిఎం జి గ్లోబల్ చైర్మన్ మరియు సిఈవో బిల్ థామస్, హెచ్‌సీ‌ల్ టెక్నాలజీస్ సిటివో కళ్యాణ్ కుమార్‌లు సైతం మంత్రితో సమావేశమయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెల్లుల్లి గుజ్జును అక్కడ అప్లై చేస్తే...?