Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీకి కేసీఆర్, రేవంత్ డిమాండ్లు, ఏంటవి?

గాంధీకి కేసీఆర్, రేవంత్ డిమాండ్లు, ఏంటవి?
, బుధవారం, 19 మే 2021 (17:59 IST)
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా కొన్ని డిమాండ్లు చేశారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలన్నారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్‌ను ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలని రేవంత్‌ అన్నారు. కోవిడ్‌తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని వ్యాఖ్యానించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్- 19 ప్రకటనల ఉపకరణాన్ని భారతదేశానికి విస్తరించిన ఫేస్‌బుక్‌