Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుణ్ణి వదల్లేని వివాహిత, వివాహితను వదల్లేని ప్రియుడు, ఇద్దరూ కలిసి...

ప్రియుణ్ణి వదల్లేని వివాహిత, వివాహితను వదల్లేని ప్రియుడు, ఇద్దరూ కలిసి...
, శనివారం, 27 మార్చి 2021 (14:46 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వివాహిత శైలజతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ సంబంధం కారణంగా ఇరువురు కుటుంబాల్లో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి.
 
ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని ఇద్దరూ కలిసి బైక్ పైన సికింద్రాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రపోతున్న భార్య.. చేతివేళ్లు తెగనరికిన భర్త.. ఎక్కడ?