Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 25న మీ అప్పు చెల్లిస్తామని చెప్పి కట్టలేక కుటుంబం ఆత్మహత్య

మార్చి 25న మీ అప్పు చెల్లిస్తామని చెప్పి కట్టలేక కుటుంబం ఆత్మహత్య
, గురువారం, 25 మార్చి 2021 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలానికి చెందిన మల్కపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక, ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నామనే బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలను - ఒక కొడుకు, కుమార్తెను గదిలో ఉరి వేశారు. ఆ తర్వాత ఇరువురు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల కుమార్తె తన అత్తమామల ఇంటి నుండి తల్లిదండ్రులను చూడటానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
పత్తి సాగులో తమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని, అప్పులు తీర్చలేకపోయామంటూ రాసిన సూసైడ్ నోటీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల చెప్పిన దాని ప్రకారం, మార్చి 25న అప్పు చెల్లిస్తామని రుణదాతకు వాగ్దానం చేసినట్లు తెలిసింది. అయితే, అదే రోజున కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారి సమయంలో ఏపీ గ్రామ వాలంటీర్ల పనితీరు అద్భుతం: కేంద్రమంత్రి