Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొగుడినే కడతేర్చిన నర్సవ్వ ... తెలంగాణాలో మరో వివాహేతర హత్య

తెలంగాణ రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తనే కడతేర్చింది. ఆమె ఘాతుకురాలి పేరు నర్సవ్వ. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. తాజాగా వెలుగు

మొగుడినే కడతేర్చిన నర్సవ్వ ... తెలంగాణాలో మరో వివాహేతర హత్య
, మంగళవారం, 9 జనవరి 2018 (09:13 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తనే కడతేర్చింది. ఆమె ఘాతుకురాలి పేరు నర్సవ్వ. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ఘనపూర్‌కు చెందిన బండి నర్సవ్వ - బాలయ్య(40) అనే దంపతులు ఉన్నారు. అయితే, బాలయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చేవాడు. గత 20 రోజుల క్రితం బాలయ్య స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాజన్న దర్శనానికి వేములవాడకు చేరుకున్నారు.
 
ఈ దంపతులిద్దరూ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి దేవాలయంలోనే నిద్రించాలని భావించారు. అయితే, ఉండేందుకు అద్దె గదులు దొరక్క పోవడంతో ఆలయ గుడిచెరువు సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిద్రించారు. ఈ క్రమంలో అర్థరాత్రి దంపతుల మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. 
 
బాలయ్య అతిగా మద్యం సేవించి ఉండటంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో భర్త గొంతును భార్య నర్సవ్వ కోసింది. దీంతో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గమనించిన ఇతర భక్తులు పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వద్దు... ప్రియుడే ముద్దు : భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య నాటకం