Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కేసులు పెరగుతుంటే.. టి. సర్కారు నిద్రపోతుందా? హైకోర్టు సీరియస్

Advertiesment
High court
, మంగళవారం, 21 జులై 2020 (11:38 IST)
తెలంగాణలో కరోనా టెస్టులు, ఇంకా కరోనా వైద్యానికి సంబంధించిన వివరాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వివరాలు అధికారులు సరిగా చూపించడంలేదని అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది.
 
కరోనా వివరాలు తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని.. వివరాలు స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు పేర్కొంది. బెడ్లు, వెంటిలేటర్లు వివరాలు ఎందుకు తెలియజేయటం లేదని ప్రశ్నించింది. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడింది. కోర్టు ఆదేశాలు పాటించని ఆదేశాలు పాటించని వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. 
 
న్యాయస్థానం తీర్పులను తెలంగాణ సర్కారు ఒక్కసారి కూడా అమలు చేయడం లేదని మండిపడింది. ఏపీ, ఢిల్లీలతో పోల్చుకుంటే.. కరోనా పరీక్షలు నిర్వహించటంలో తెలంగాణ బాగా వెనకబడిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులకు బ్యాడ్ న్యూస్: శ్రీవారి దర్శనానికి టోకెన్ల జారీకి తాత్కాలిక బ్రేక్..!