Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసిన వృద్ధురాలు .. ఎందుకో తెలుసా?

mro office locked
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు ఒక ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసింది. కార్యాలయ అద్దె చెల్లించమని కొన్ని నెలలుగా మొత్తుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. 
 
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది. ఈ మండలానికి చెందిన చంద్రమణి అనే మహిళ తన ఇంటిని ఎమ్మార్వో కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఆరంభంలో సజావుగానే అద్దె చెల్లిస్తూ వచ్చిన అధికారులు ఆ తర్వాత చెల్లించడం మానేశారు. దీంతో అద్దె చెల్లించాలని ఆమె కార్యాలయ అధికారులు చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగింది. 
 
కానీ, వారు మాత్రం కనికరించలేదు. దీంతో విసుగు చెందిన చంద్రమణి.. మంగళవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఏకంగా తాళం వేసింది. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చొంది. ఇప్పటివరకు మొత్తం రూ.7,37,00 అద్దె చెల్లించాలని ఆమె వాపోయింది. ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే ఇంటి యజమానులు ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఆ ముగ్గురు మాత్రమే ట్రెండ్ సెట్టర్లు : వైకాపా ఎమ్మెల్యే