Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి

Advertiesment
గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి
, సోమవారం, 9 ఆగస్టు 2021 (15:31 IST)
హైద‌రాబాదులోని హిమాయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నారాయణుడికి గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా నైవేద్యం స‌మ‌ర్పించి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నారాయ‌ణుడికి నూటొక్క నారికేళ సమర్పణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్‌తో పాటు దైవజ్ఞ శర్మ, సినీ నటి రోజారమణి, బాలకృష్ణ, చంద్రస్వామి, జగిని రమేష్, జగిని శ్రీను,హనుమాన్ కీసరి, భీమిరెడ్డి సురేందర్, మంజులా రెడ్డి, శివశంకర్, రాజ గోపాల్ నాయుడు, రవి,శంకర్ పురోహిత్,ఆది వేణు, సంపత్, గోవింద మాల,శంఖు శ్రీను,లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి గో ఆధారిత నైవేద్యం నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని భ‌క్త బృందం తెలిపింది. దీని వ‌ల్ల ఆల‌యానికి ఎంతో విశిష్ఠ‌త చేకూరుతుంద‌ని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో బిజెపికి బుద్ది చెప్పాలి