Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో బిజెపికి బుద్ది చెప్పాలి

Advertiesment
Congress leader
, సోమవారం, 9 ఆగస్టు 2021 (15:24 IST)
విజ‌య‌వాడ‌లోని ఎపిసిసి కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ జాతీయ పతాకాన్నిఎగుర వేసి, అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.

అనంత‌రం సాకే శైలజానాధ్ మాట్లాడుతూ, ఆనాడు మనుషులు మధ్య విభేధాలు పెట్టి బ్రిటీష్ వాళ్లు దోచుకున్నార‌ని, పేదలకు నీడ లేకుండా తెల్లదొరలు అనేక హింసలు పెట్టార‌న్నారు. మహాత్మాగాంధీ నాడు క్విట్ ఇండియా అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చార‌ని, ఎందరో మహనీయులు త్యాగాలతో తెల్ల దొరలు వెళ్లిపోయార‌ని, ఇపుడు న‌ల్ల‌దొర‌లు మ‌ళ్ళీ దేశాన్ని బానిస‌త్వంలోకి తీసుకెళుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
దేశ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని, ఆర్.ఎస్. ఎస్. భావజాలంతో బిజెపి పాలకులు ప్రజల మధ్య కుల, మతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ‌చేసి.. నియంతృత్వ పాలన సాగిస్తున్నార‌ని, అలాంటి బిజేపీకి క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తి తో ప్రజలు తగిన బుద్ది చెప్పాల‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను బ‌య‌టికి వ‌చ్చేసా, ఇక్క‌డంతా నిర్బంధ‌మే సార్, బాబుతో ఉమ