Publish Date: Fri, 18 Jun 2021 (07:45 IST)
Updated Date: Fri, 18 Jun 2021 (07:47 IST)
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24 వరకు పొడిగించారు.
ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది, అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకోగా తాజా పొడిగింపుతో మిగిలిపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఇప్పటికే జులై 5 నుంచి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రన్స్ టెస్టులను ఉన్నత విద్యామండలి రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు ఎంట్రన్స్ సెట్స్ లో మూడు సెట్స్ తేదీల్లో మార్పు ఉంటుందని, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు పొడిగింపు వల్ల వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకనే అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు.