Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించి విఫమలైన సీపీఎం... తొలి జాబితా రిలీజ్

cpm flags
, ఆదివారం, 5 నవంబరు 2023 (13:33 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలంగాణ సీపీఎం నేతలంతా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా వెల్లడించింది. మొత్తం 14 మంది అభ్యర్థులతో ఆ జాబితాను విడుదల చేయగా, అందులో పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు. 
 
అలాగే, ఈ ఎన్నికల్లో తమకు పట్టున్న 14 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెల్సిందే ఇందులోభాగంగా తొలిసారి 14 మంది అభ్యర్థులతో ఈ జాబితాను వెల్లడించింది. ఆదివారం సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. 
 
సీపీఎం తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే, కారం పుల్లయ్య (భద్రాచలం-ఎస్టీ), పిట్టల అర్జున్ (అశ్వారావు పేట-ఎస్టీ), తమ్మినేని వీరభద్రం (పాలేరు), పాలడుగు భాస్కర్ (మధిర - ఎస్సీ), భూక్యా వీరభద్రం (వైరా - ఎస్టీ), ఎర్ర శ్రీకాంత (ఖమ్మం), మాచర్ల భారతి (సత్తుపల్లి 0 ఎస్సీ), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), చిన వెంకులు (నకిరేకల్-ఎస్సీ), కొండమడుగు నర్సింహా (భువనగిరి), మోకు కనకారెడ్డి (జనగామ), పగడాల యాదయ్య (ఇబ్రహీంపట్నం), జె.మల్లికార్జున (పటాన్‌చెరు), ఎం.దశరథ్ (ముషీరాబాద్). 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ కీలక నిర్ణయం!!