Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అస‌త్య‌మే బిజెపి ఆయుధం: మంత్రి హ‌రీష్ రావు

Advertiesment
BJP
, శనివారం, 31 అక్టోబరు 2020 (06:07 IST)
బిజెపి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో జూటా మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట‌లో మంత్రి హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర బిజెపి నాయ‌కులు త‌మ వైఖ‌రితో బిజెపిని భార‌తీయ జూటా పార్టీగా మార్చేశార‌ని పేర్కొన్నారు.

పూట‌కో పుకారు పుట్టించి.. గంట‌కో అబ‌ద్దం మాట్లాడ‌టం బిజెపి నాయ‌కుల నైజం అని మండిప‌డ్డారు. వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాల‌నే సామెత అంద‌రికి గుర్తే.. అలా దుబ్బాక‌లో వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా ఒక ఎన్నిక గెల‌వాలె అనే కొత్త సామెత‌ను సృష్టిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.
 
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభం నుంచి ఒక్క బిజెపి నాయ‌కుడు కూడా నిజం మాట్లాడ‌టం లేదు.. అబ‌ద్దాలే పునాదిగా బిజెపి నాయ‌కులు త‌ప్పుడు ప్ర‌చారాల‌కు తెర‌తీసింద‌న్నారు. బిజెపి రాష్ర్ట అధ్య‌క్షుడు మొద‌లుకొని గ్రామ‌స్థాయి వార్డు నేత దాకా అంద‌రూ అబ‌ద్దాలు ఆడేవారే అని ధ్వ‌జ‌మెత్తారు.

అస‌త్య‌మే బిజెపి ఆయుధం అని కోపోద్రిక్తుల‌య్యారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు వారి నైజం అని విరుచుకుప‌డ్డారు. భార‌తీయ సాంప్ర‌దాయానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పుకునే బిజెపి నాయ‌కులు.. స‌త్య‌మేవ జ‌య‌తే అనే ఉప‌నిష‌త్ సూక్తిని విస్మ‌రించారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్యూషన్‌ ఫీజు 30శాతం తగ్గింపు : ప్రైవేట్‌ కళాశాలలకు ఏపీ ప్రభుత్వం షాక్