Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:33 IST)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్‌యూఐ సభ్యులు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి వాహ‌నాన్ని అడ్డుకున్నారు. ఆపై కారుపై కోడిగుడ్లు కొట్టారు.
 
ఎన్ఎస్‌యూఐ సభ్యులు చ‌ర్య‌తో ఆగ్రహించిన మంచిరెడ్డి అనుచ‌రులు..గన్ వెమన్ వెంటనే కారు దిగి మరీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని ప‌ట్టుకుని చితక్కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో సాగర్ హైవేపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌పడ్డాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ