Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముక్కుపచ్చలారని బాలుడు... పచ్చటి లాన్‌లో ఆడుకుంటూ అనంతలోకాలకు...

ముక్కుపచ్చలారని బాలుడు... పచ్చటి లాన్‌లో ఆడుకుంటూ అనంతలోకాలకు...
, బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:02 IST)
హైదరాబాద్ నగరంలో విద్యుదాఘాతానికి గురైన బాలుడు మృతి చెందిన సంఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వివరాలలోకి వెళ్తే చెన్నైకి చెందిన దివాకర్ భార్యాపిల్లలతో కలిసి పీరంచెరువులోని ఫెబల్ సిటీలో ఈ-బ్లాక్ 8వ నంబర్ ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. ఇతను స్థానికంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని ఏడేళ్ల కుమారుడు మోనీష్ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుకుంటున్నాడు. 
 
ప్రతి రోజూ స్కూల్ అయిపోగానే అపార్ట్‌మెంట్స్ లాన్‌లో తోటి పిల్లలతో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకుంటూ అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అప్పటికే స్తంభం కింది భాగంలో కట్ అయిన వైర్ నుండి విద్యుత్ సరఫరా అవుతోంది. పిల్లలు, పెద్దవారు అంతగా గమనించలేదు, ఒక నిమిషం తర్వాత కింద పడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
దీంతో అపార్ట్‌మెంట్ వాసులు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. మోనీష్ తండ్రి కూడా పోస్టుమార్టానికి తొలుత అంగీకరించలేదు. ఆ తర్వాత దోషులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో అంగీకరించారు. నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. అపార్ట్‌మెంట్‌ల కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఇప్పటికే ఎన్నో ఘటనలు నిరూపించినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం బాధాకరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్‌ టాక్‌ యాప్‌ను నిషేధించండి.. తమిళనాడు సర్కార్ డిమాండ్