Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణాలో మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
, శనివారం, 31 జులై 2021 (12:22 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు కాలేజీలను వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాలల్లో ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
 
అయితే మంజూరు చేసిన అన్ని కాలేజీలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాగా పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మంజూరుపై ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు