Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులకు అస్వస్థత

బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులకు అస్వస్థత
, మంగళవారం, 30 నవంబరు 2021 (13:02 IST)
హైదరాబాద్ నగరంలోని పటాచెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెదుతున్నారు. 
 
అస్వస్థతకు లోనైన విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఈ ముగ్గురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు లోనైన విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. 
 
కాగా, ఇటీవల ఈ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఇప్పటికే 37 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనుకావడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి