Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంజాయి మత్తులో కన్నెపై కాటేసిన కామాంధుడు

గంజాయి మత్తులో కన్నెపై కాటేసిన కామాంధుడు
, శుక్రవారం, 16 జులై 2021 (09:32 IST)
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. గంజాయి మత్తులో ఓ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. వ‌న‌స్థ‌లిపురం కాంప్లెక్స్ వ‌ద్ద ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళుతుండగా గంజాయి మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు త‌న బైక్‌పై ఆ బాలిక‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత మైన‌ర్‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 
 
బాలిక‌ను శుక్రవారం ఉద‌యం ఆ కాంప్లెక్స్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయాడు. త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి త‌ల్లిదండ్రులు వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక‌పై అత్యాచారం చేసిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ఐటీ కంపెనీలు