Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంటి బయట ఆడుకుంటుంటే..?

Advertiesment
Uttar pradesh
, గురువారం, 15 జులై 2021 (16:58 IST)
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావట్లేదు. వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. అభంశుభం తెలియని పిల్లలకు మాయమాటలు చెప్పి వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలికకు తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
లైంగిక దాడి తర్వాత ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అతడు అంగీకరించాడు. నిందితుడికి భార్య కూడా ఉంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థర్డ్ వేవ్‌పై WHO హెచ్చరిక : అలసత్వం ప్రదర్శించారో...