Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవినీతి అనకొండ.. ఏపీబీ తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు స్వాధీనం (Video)

Advertiesment
Cash

ఠాగూర్

, శుక్రవారం, 9 ఆగస్టు 2024 (18:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌ (ఇన్‌చార్జ్ రెవెన్యూ ఆఫీసర్)గా దాసరి నరేందర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈయనపై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగు చూశాయి. 
 
ఇంట్లో రూ.2.93 కోట్ల నగదును, రూ.1.10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్‌ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నాయి. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లుగా గుర్తించారు.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SNAP టెస్ట్ 2024 ద్వారా MBA అడ్మిషన్స్ ప్రారంభించిన సింబియాసిస్