Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో కాశ్మీర్ టెక్కీ ఆత్మహత్య.. అంతా ప్రేమ వ్యవహారమే

Advertiesment
love couple

సెల్వి

, సోమవారం, 11 నవంబరు 2024 (12:19 IST)
మల్టీ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల టెక్కీ మృతదేహం గుల్షన్‌నగర్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో లభ్యమైందని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. బాధితురాలిని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇరామ్ నబిదార్‌గా గుర్తించారు. నవంబర్ 7వ తేదీ నుంచి ఆమె కార్యాలయంలో లాగిన్ కాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె కార్యాలయంలో అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
 
బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లాట్ తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని, మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు గెలిపించింది.. వైఎస్ షర్మిల