Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

Advertiesment
image

ఐవీఆర్

, బుధవారం, 4 జూన్ 2025 (20:00 IST)
మహబూబాబాద్ జిల్లా: పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత సాయి దత్త పీఠం నిత్యఅన్నదానం, సత్సంగ్, ఛారిటీ, విద్య ఈ నాలుగు మూల స్తంభాలుగా భావించి సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది. వెన్నారం గ్రామంలోని పేద వాడైన అర్చకుడు రామానుజం కుమార్తె చదువు కోసం, ఉన్నత విద్య కోసం సాయి దత్త పీఠం లక్షరూపాయల ఆర్ధిక సాయం చేసింది.
 
ఈ కార్యక్రమంలో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎస్డీపీ అయ్యప్ప గ్రూప్ గురుస్వాములు, స్వాములు అందరూ ఇతోధికంగా తమవంతు చేయూత అందించారు. ఈ విధంగా రామానుజం కుమార్తె తన్మయి రామానుజం విద్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరంలో కూడా సాయం చేస్తామని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు. హైదారాబాద్‌లో రామానుజం కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును సాయిదత్త పీఠం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)