Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన హీరో బాలకృష్ణ

Advertiesment
balakrishna
, శనివారం, 30 డిశెంబరు 2023 (18:50 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ సమయంలో ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. 
 
కాగా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో బాలకృష్ణతో పాటు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సభ్యులు తదితరులు ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా సీఎంను కలిశారు. అంతకుముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సీపీఎం నేతలు కూడా సీఎంను కలిశారు. అలాగే, టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా తన సతీమణి అక్కినేని అమలతో కలిసి వెళ్లి సీఎంను కలిశారు. 
 
సీనియర్ నటి జయప్రద మిస్సింగ్.. పోలీసుల గాలింపు? 
 
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కనిపించడం లేదు. దీంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. గత 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకావడం లేదు. కోర్టు ఆదేశించినా ఆమె పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆమెకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ అయింది. వచ్చే నెల 10వ తేదీన ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆమె కనిపించకపోవడంతో రాంపూర్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. 
 
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని దంపతులు 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున దంపతులు శనివారం కలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని సీఎం రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన త్రవాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే రేవంత్‌ను అక్కినేని నాగార్జున తన సతీమణి అక్కినేని అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో వలంటీర్లకు రూ.750 ప్రోత్సాహక నగదు : సర్కారు వెల్లడి