Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్వరం - గొంతు నొప్పితో బాధపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి!

cmrevanth
, సోమవారం, 25 డిశెంబరు 2023 (11:15 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మూడు రోజులుగా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఇంటి వద్దే ఫ్యామిలీ వైద్యుడు పరీక్షించి తగిన మందులను సూచించారు. ఆ మందులను సీఎం రేవంత్ రెడ్డి వాడుతూ, రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. 
 
ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఇందుకోసం ఆయన నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ముందుగానే సమావేశమందిరానికి చేరుకున్నారు. నిజానికి ఆ సమావేశాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకే నిర్వహించాలనుకున్నారు. కానీ అది మూడు గంటల వరకు సాగింది. కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో సీఎం కొంత నీరసంగా కనిపించినప్పటికీ.. కార్యక్రమాన్ని కొనసాగించారు. 
 
అలాగే, గత గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆ మరుసటి రోజు నుంచి సీఎం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన 'ఎట్‌ హోం' కార్యక్రమానికి సతీసమేతంగా హాజరయ్యారు. శనివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని ఏర్పాటు చేసిన గిగ్‌ వర్కర్ల సమావేశానికి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్‌ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నతాధికారులతో పలు సమీక్షలు నిర్వహించి క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన అస్వస్థతను కూడా ఆయన లెక్క చేయడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికారం లేక నిద్ర పట్టడం లేదా? - భారసాకు బండ్ల గణేశ్‌ కౌంటర్