Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు... ఇద్దరు బాలికల ఆత్మహత్య.. ఇంట్లో ఎవరూ..?

suicide

సెల్వి

, మంగళవారం, 25 జూన్ 2024 (12:34 IST)
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఓ బాలికను బలి తీసుకుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల - తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన సోనీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.
 
అదేవిధంగా కరీంనగర్ - జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) అనే బాలిక కూడా ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో పురుగుల మందుతాగింది. 
 
అయితే కొద్దిరోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వర్గంలో భూములు అమ్ముతానంటున్న చర్చి ఫాస్టర్..!