Publish Date: Tue, 30 Apr 2024 (14:40 IST)
Updated Date: Tue, 30 Apr 2024 (14:49 IST)
మే 8న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని తొలి వేములవాడ పర్యటన దృష్ట్యా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఆయన దర్శనం, ప్రత్యేక పూజలు చేసేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఉదయం 10 గంటలకు వేములవాడలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించేందుకు షెడ్యూల్ సిద్ధమవుతోంది. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ను రెండు లేదా మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.