తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ విచారణలో భాగంగా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విచారణ కమిషన్ ముందు బుధవారం హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా, జస్టిస్ ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు అధికారులు, నిర్మాణ సంస్థలు ప్రతిధులు, అప్పటి మంత్రులను విచారించింది. తాజాగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్ర కేసీఆర్ను విచారించనుంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గత యేడాది మార్చిలో సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటుచేసిన విషయంతెల్సిందే.
ఈ క్రమంలో కమిషన్ బ్యారేజీ నిర్మాణ ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించనుంది. వారి అఫిడవిట్లు స్వీకరించి, క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తి చేసింది. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావులను కూడా కమిషన్ విచారించింది.
ఈ విచారణ కోసం బుధవారం ఉదయం 11 గంటలకు బూర్గుల రామకృష్ణరావు భవన్లో జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించింది. ఇప్పటివరకు మీడియా, కమిషన్లోని ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరిపిన కమిషన్, కేసీఆర్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తుందా, లేక కేవలం కమిషన్ అధికారుల సమక్షంలోనే ఇక కెమెరా విచారణ జరుపుతుందా అదే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, కేసీఆర్ రాక సందర్భంగా బూర్గుల భవనం వద్ద