Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రంజాన్ 2024.. మిలియన్ ప్లేట్ల బిర్యానీ- స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాదీస్

Mutton Biryani

సెల్వి

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (13:42 IST)
పవిత్ర రంజాన్ 2024 మాసం ముగిసింది. భక్తులు ఈద్ జరుపుకుంటున్నారు. ఈ కాలంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు, ప్రజలు తమ రంజాన్ ఉపవాసం ముగింపును ఇఫ్తార్‌తో సూచిస్తారు. ఈ సాయంత్రం భోజనం సాధారణంగా అనేక రకాల రుచికరమైన వంటకాలను కలిగి ఉంటుంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గి ఇటీవల డేటాను విడుదల చేసింది. 
 
ఇది దాని కస్టమర్‌లు ఆర్డర్ చేసిన కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన ఇఫ్తార్ ఫుడ్‌ల గురించి వెల్లడించింది. ఈ రంజాన్ ఆర్డర్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది. మార్చి 12 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు స్విగ్గీలో చేసిన ఆర్డర్‌ల ఆధారంగా ఈ ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. 
 
భారతదేశంలో రంజాన్ 2024 సందర్భంగా ప్లాట్‌ఫారమ్ ద్వారా సుమారు 6 మిలియన్ల బిర్యానీ ప్లేట్లు ఆర్డర్ చేయబడ్డాయి. సాధారణ నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో ఇధి 15 శాతం పెరిగింది. ఇందులో అత్యధికంగా ఆర్డర్ చేసిన నగరం హైదరాబాద్.  
 
మిలియన్ ప్లేట్ల బిర్యానీ, 5.3 లక్షల ప్లేట్ల హలీమ్‌ను రంజాన్ 2024 సందర్భంగా స్విగ్గీలో ఆర్డర్ చేశారు ప్రజలు. అదీ ఇప్తార్ సమయంలో ఈ సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా, ఈ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలూడా, ఖీర్.
 
ఇకపోతే.. రంజాన్ సందర్భంగా, దేశవ్యాప్తంగా సాంప్రదాయ రుచికరమైన వంటకాల కోసం స్విగ్గీపై ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయి. హలీం, ఫిర్ని, మాల్పువాలు పెరిగాయి. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్‌లలో ఇఫ్తార్ స్వీట్ డిష్‌ల ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేసేది లేదు