Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా.. తిన్న వారంతా వాంతులు

samosa

సెల్వి

, మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (14:58 IST)
పూణెలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటిన్ సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు రావడంతో ఉద్యోగులు వాంతులు చేసుకున్నారు. దీనిపై సమోసాలు సప్లై చేసిన కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్యాటరింగ్ కంపెనీకి వెళ్లి విచారించిన పోలీసులు ఇదంతా ఆ కంపెనీ మాజీ ఉద్యోగుల నిర్వాకమని తేల్చారు.

ఉద్యోగంలో నుంచి తొలగించారనే కోపంతో  క్యాటరింగ్ కంపెనీకి చెడ్డపేరు తేవాలని ఈ పని చేసినట్లు తేలింది. దీంతో మాజీ ఉద్యోగులు ముగ్గురితో పాటు ఈ నిర్వాకానికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

దీనికి కారణమైన ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ప్రతీకార స్టోరీ మొత్తం బయటపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఏప్రిల్ 23 వరకు పొడిగింపు