Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైబరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. వీకెండ్ పార్టీ.. 24మంది అరెస్ట్

party

వరుణ్

, ఆదివారం, 7 జులై 2024 (10:00 IST)
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి ఖాజాగూడాలోని ది కేవ్ బార్ అండ్ లాంజ్‌లో దాడులు నిర్వహించారు. 
 
ఈ దాడుల్లో 24మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీకెండ్ ఈవెంట్‌ పేరుతో జరిగిన ఈ పార్టీలో పట్టుబడిన 50మందికి జరిపిన పరీక్షల్లో 24మందికి పాజిటివ్ అని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ పార్టీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఈవెంట్ ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్ అధికారి!