సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొంది. ఈ ఘటనలో బీఎండబ్ల్యూ కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వివరాల్లోకి వెళితే, కొల్లూరు నుంచి పటాన్ చెరు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొంది.
ఈ ప్రమాదంలో టైర్లు ఊడి పోగా, ఇంజిన్ తప్పితే మిగతా భాగం అంతా పాడైంది. కారు డ్రైవర్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోగా, బెలూన్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి తీవ్రగాయాలనైట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఆతనిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని.. ఈ మధ్య ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.