Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారాలింపిక్స్ పోటీలు : భారత్ ఖాతాలో మరో స్వర్ణం

Advertiesment
Tokyo Paralympics
, ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (08:52 IST)
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత్ క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. 
 
బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో ఫ్రాన్స్‌ షట్లర్‌ మజుర్‌ లుకాస్‌ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్‌ రజతంతో ఇంటికి తిరిగి పయణమయ్యారు. ఈ పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది.
 
భారత్ ఆటగాళ్లు సాధించిన మొత్తం పతకాల్లో నాలుగు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, టోక్యో పారాలింపిక్స్‌ ఆదివారంతో ముగియనున్నాయి. చివరి రోజు భారత అథ్లెట్లు.. మరో మూడు పతకాల కోసం పోటీ పడనున్నారు.
 
ఇదిలావుంటే, విశ్వక్రీడల్లో మనదేశం తరపున స్వర్ణం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అవని.. టోక్యో పారాలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఆదివారం జరుగనున్న కార్యక్రమంలో అవని త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందు నడవనుండగా భారత్‌ నుంచి 11 మంది ఇందులో పాల్గొననున్నారు....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ శర్మ సెంచరీ, భారత్ 100 పరుగుల ఆధిక్యం