Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇన్నాళ్లకు నా కల నెరవేరింది... మా అమ్మానాన్న తొలిసారి విమానం ఎక్కారు..?

ఇన్నాళ్లకు నా కల నెరవేరింది... మా అమ్మానాన్న తొలిసారి విమానం ఎక్కారు..?
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (13:28 IST)
NeerajChopra
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా కల నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్ 2020కి తర్వాత స్వదేశం చేరిన తర్వాత వరుసగా సభలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేశాడు. ఎట్టకేలకు కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.
 
నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ ఓ సాధారణ రైతు. తల్లి సరోజ్ దేవి, గృహిణి. వీరికి నీరజ్ చోప్రాతో పాటు  ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. సతీశ్ కుమార్‌కి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబపోషణ, ఆర్థిక సమస్యల కారణంగా, అది కలగానే మిగిలిపోయింది. 
 
నీరజ్ చోప్రా, తన తండ్రి కోరికను నిజం చేశాడు. తల్లిదండ్రులతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నీరజ్ చోప్రా... ‘నా చిన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. మా అమ్మానాన్న మొదటిసారి విమానం ఎక్కారు...’ అంటూ మురిసిపోతూ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వాయిదా