Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాంపియన్స్‌ ట్రోఫీ : సర్దార్‌ సింగ్‌కు పిలుపు

ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం గురువారం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌‌కు తిరిగి చోటు కల్పించారు. మిడ్‌ ఫీల్డ్‌ను బలోపేత

చాంపియన్స్‌ ట్రోఫీ :  సర్దార్‌ సింగ్‌కు పిలుపు
, శుక్రవారం, 1 జూన్ 2018 (07:37 IST)
ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం గురువారం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌‌కు తిరిగి చోటు కల్పించారు. మిడ్‌ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్రాలను ఎంపిక చేశారు.
 
మొత్తం 18 మంది సభ్యుల జట్టుకు గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ యేడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. 
 
ముఖ్యంగా, కామన్వెల్త్‌ జట్టులో చోటుదక్కని సర్దార్‌ సింగ్, లక్రాలను తిరిగి ఎంపిక చేయడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో భాగంగా, ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది. 
 
జట్టు వివరాలు :
గోల్‌కీపర్స్‌: శ్రీజేశ్‌ (కెప్టెన్‌), బహదూర్‌ పాఠక్‌. 
డిఫెండర్స్‌: హర్మన్‌ప్రీత్‌ సింగ్, వరుణ్‌ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్‌ రొహిదాస్‌. 
మిడ్‌ఫీల్డర్స్‌: మన్‌ప్రీత్‌ సింగ్, చింగ్లెన్‌సన సింగ్, సర్దార్‌ సింగ్, వివేక్‌ సాగర్‌. 
ఫార్వర్డ్స్‌: సునీల్‌ విఠలాచార్య, రమణ్‌దీప్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, సుమిత్‌ కుమార్, ఆకాశ్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెంచ్ ఓపెన్ : మూడో రౌండ్‌కు బోపన్న జోడీ... నాదల్ కూడా...