శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిలిపివేసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగితోంది.