తితిదే ఈఓగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తి
Publish Date: Sat, 06 May 2017 (12:36 IST)
Updated Date: Sat, 06 May 2017 (12:38 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శిచుకున్నారు.
అనంతరం అలిపిరి పాదాల మండపం నుంచి కాలిబాటన తిరుమలకు వెళ్ళారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్సించుకున్న తరువాత గత ఈఓ సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.