Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో తితిదే ఈఓ, జెఈఓ ఆకస్మిక తనిఖీలు

Advertiesment
తిరుమలలో తితిదే ఈఓ, జెఈఓ ఆకస్మిక తనిఖీలు
, శనివారం, 11 జూన్ 2016 (16:23 IST)
తిరుమలలో తితిదే ఈఓ సాంబశివరావు, జెఈఓ శ్రీనివాసరాజులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సర్వదర్శనం క్యూలైన్ల నుంచి కంపార్టుమెంట్లలోకి వెళ్ళే నారాయణగిరి క్యూలైన్లతో పాటు మరికొన్ని లైన్లను వీరు పరిశీలించారు. భక్తులతో స్వయంగా మాట్లాడిన ఈఓ వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. క్యూలైన్లలోకి వెళ్లేటప్పుడు శ్రీవారి సేవకులతో పాటు తితిదే సిబ్బంది మర్యాదపూర్వకంగా మజ్జిగ, నీటిని పంపిణీ చేస్తున్నట్లు భక్తులు ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు.
 
నారాయణగిరి వద్ద భక్తులు ఎక్కువగా క్యూలైన్లలో ఉండటంతో వారిని వెంటనే కంపార్టుమెంట్లలోకి తరలించే ప్రయత్నం చేయాలని అధికారులను ఈఓ ఆదేశించారు. రద్దీ సమయాల్లో కూడా భక్తులను త్వరితగతిన దర్సన భాగ్యం కల్పిస్తున్నామని ఈఓ సాంబశివరావు మీడియాకు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో అగ్నిప్రమాదాలకు కారణం ఎవరు?... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే..?