Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డు స్థాయిలో మే నెలలో 25 లక్షల మంది భక్తుల శ్రీవారి దర్శనం

Advertiesment
Tirumala May month rush
, శుక్రవారం, 3 జూన్ 2016 (11:47 IST)
వేసవి సెలవులు కావడంతో మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 25,08,387మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో లభించింది. 79 కోట్ల 69 లక్షల రూపాయలు తితిదేకి లభించింది. 
 
అలాగే 60,50,483 మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. 14,51,968మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 97,24,718మంది భక్తులు లడ్డూలను భక్తులకు తితిదే అందించింది. 18,529మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. ప్రతియేటా వేసవి సెలవుల్లో భక్తులు అధికసంఖ్యలో రావడం సహజం. అయితే ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగవద్గీత పారాయణం వల్ల కలిగే ఫలితాలేమిటి...?